లక్నో: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు అర్చకుల వేషధారణలో కనిపించారు. పురుష పోలీసులు ధోతీ కుర్తా, మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు.
(Police In Priests Attire) అయితే సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దీనిని ఖండించారు. పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడానికి అనుమతించడం భద్రతకు పెను ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు. పోలీసులు పూజారుల వేషం వేయడం ఏ ‘పోలీస్ మాన్యువల్’ ప్రకారం సరైనది? మోసగాళ్లు దీన్ని సద్వినియోగం చేసుకుని అమాయక ప్రజలను మోసగిస్తే ఏం చేస్తారు? యూపీ ప్రభుత్వం, పాలనా యంత్రాంగం ఏం సమాధానం చెబుతుంది? అని ప్రశ్నించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. పూజారుల వేషధారణలో ఉన్న పోలీసుల వీడియో క్లిప్ను షేర్ చేశారు.
కాగా, వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఈ చర్యను సమర్థించారు. ఇతర ప్రాంతాల్లో కంటే ఆలయాల్లో పోలీసుల విధులు వేరుగా ఉంటాయని తెలిపారు. భారీ భక్తుల రద్దీని నియంత్రించాల్సి ఉంటుందని చెప్పారు. భక్తులను పోలీసులు నెడితే వారు మరోలా భావిస్తారని, అదే పని పూజారులు చేస్తే సానుకూలంగా స్వీకరిస్తారని అన్నారు. అందుకే భక్తుల శ్రేయస్సు, అశాంతి, ఆందోళనలను నివారించేందుకు పోలీసులను అర్చకుల వేషధారణలో మోహరించినట్లు వెల్లడించారు.
पुजारी के वेश में पुलिसकर्मियों का होना किस ‘पुलिस मैन्युअल’ के हिसाब से सही है? इस तरह का आदेश देनेवालों को निलंबित किया जाए। कल को इसका लाभ उठाकर कोई भी ठग भोली-भाली जनता को लूटेगा तो उप्र शासन-प्रशासन क्या जवाब देगा।
निंदनीय! pic.twitter.com/BQUFmb7xAA
— Akhilesh Yadav (@yadavakhilesh) April 11, 2024