శ్రీనగర్ : జమ్ము డివిజన్లోని పూంచ్, రాజోరి అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆపరేషన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో ఇద్దరు జేసీవోలతో సహా తొమ్మిది మంది జవాన్లు వీరమరణం పొందారు. సెర్చ్ ఆపరేషన్ ఏడవ రోజుకు చేరగా.. ఆదివారం అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్లో ఓ మహిళ, ఆమె కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు బలగాలు అదుపులోకి తీసుకొని, వారిని విచారిస్తున్నాయి.
భటదుడియాలో నివాసం ఉంటున్న 45 సంవత్సరాల మహిళ, ఆమె కుమారుడితో పాటు మరో వ్యక్తిని ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు ఈ ముగ్గురు స్వచ్ఛందంగా?, బెదిరింపులకు దిగడంతో ఆహారం, ఆశ్రయం ఇచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పూంచ్ రాజోరీలను కలిపే అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిని గమనించామని, ఈ మేరకు ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వారంలో మూడుసార్లు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయని, ఉగ్రవాదులు దాక్కున్నారని, ఉమ్మడి దళాలు ఆపరేషన్లో నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులో వారే ప్రాంతానికి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. మట్టుబెట్టేందుకు సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. పారా కమాండోలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను ఎరివేసేందుకు ఆపరేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బలగాలు ప్రస్తుతం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజోరీ – పూంచ్ హైవేపై ట్రాఫిక్ను నిలిపివేశారు. ఈ నెల 14న సాయంత్రం నుంచి హైవే మూసే ఉన్నది.