న్యూఢిల్లీ : న్యాయం కోసం తప్పనిసరై రెజ్లర్లు రోడ్డుమీదకు రావాల్సి వచ్చిందని, విచారణను ఆలస్యం చేస్తున్నారంటూ ఢిల్లీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బాధిత రెజ్లర్లను బలిపశువు చేశారని అన్నారు. రెజ్లర్ల కేసులో ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది బృందా గ్రోవర్ విమర్శించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులపై లైంగిక ఆరోపణలు చేయలేమన్న సంకేతాలు వెలువడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.