న్యూఢిల్లీ : కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ‘ఉజ్వల 2.0’ (Ujjwala 2.0) ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో వేయి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందివ్వడం ద్వారా ఈ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ మౌర్య, దినేశ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఈ పథకం కింద ఎలాంటి చిరునామా ధ్రువీకరణ లేకుండానే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా జాతినుద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. సౌభాగ్య యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల పేద కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద 2 కోట్ల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చామని, ఇవి పూర్తిగా మహిళల పేరిటే రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. ఇల్లు, విద్యులు, తాగునీరు, టాయ్లెట్, గ్యాస్, రోడ్లు, దవాఖానలు, పాఠశాలల కోసం ఇప్పటికీ ఎదురుచూస్తుండటం విచారకరమన్నారు. ఈ సందర్భంగా బుందేల్ఖండ్కు చెందిన గొప్ప క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ను స్మరించుకుంటున్నానని, ఆయన స్ఫూర్తితో ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే కాకుండా భవిష్యత్పై ఆశలు రేకెత్తించేలా క్రీడాకారులు సత్తా చాటారని కొనియాడారు.
ఈసారి గ్యాస్ కనెక్షన్తోపాటు ఉచితంగా గ్యాస్ బండ కూడా ఉచితంగా అందివ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటి మంది అల్పాదాయ వర్గాల వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందివ్వడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. తొలుత ఈ పథకాన్ని 2016 లో కేంద్రం ప్రారంభించింది. 2019 ఆగస్టు నాటికి ఐదు కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకున్నది. ఉజ్వల 2.0 ప్రారంభం సందర్భంగా పలువురు పాత లబ్ధిదారులతో మోదీ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఇలా నీరజ్ ‘పసిడి’కి గుర్తింపు..
నెట్ఫ్లిక్స్తో చేతులు కలిపిన సంజయ్లీలా భన్సాలీ
వీరి నివాసం కేరాఫ్ పోలీస్ స్టేషన్..!
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
శ్రీనగర్లో రాహుల్గాంధీ పర్యటన
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..