ముంబై: మహారాష్ట్రలోని పూణెలో నిర్మాణం పూర్తయిన పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గార్వేర్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. ఆ తర్వాత స్వయంగా టికెట్ కొనుగోలు చేశారు. గార్వేర్ కాలేజ్ నుంచి ఆనంద్ నగర్ వరకు నడిచిన తొలి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థుల పక్కన కూర్చొని వారితో ముచ్చటించారు.
కాగా, 2016 డిసెంబర్ 24న పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూ.11,400 కోట్ల వ్యయంతో మొత్తం 32.2 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. తొలి దశలో పూర్తయిన 12 కిలోమీటర్ల మేర మెట్రో రైలు కారిడార్ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు.
అనంతరం ప్రధాని మోదీ పూణెలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పూణె మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మూలా-ముఠా నది ప్రాజెక్టుల పునరుజ్జీవనం, కాలుష్య నివారణకు శంకుస్థాపన చేశారు.