న్యూఢిల్లీ: ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్కు క్రేజీ పెరుగుతోంది. ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నవారి సంఖ్య నేటికి కోటి దాటింది. ప్రపంచ దేశాధినేతల్లో మోదీ ఛానల్కు అత్యధిక స్థాయిలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. మోదీ యూట్యూబ్ ఛానల్ను 2007లో క్రియేట్ చేశారు. గుజరాజ్ సీఎంగా ఉన్న సమయంలో ఆ ఛానల్ను స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ ఛానల్ను 164.31 కోట్ల మంది వీక్షించారు. 2019లో కాశీ పర్యటన సమయంలో దివ్యాంగులు ఆయనకు వెల్కమ్ చెప్పిన వీడియోను అత్యధికంగా చూశారు. 2019లోనే అప్పటి ఇస్రో చైర్మెన్ కేశివన్తో భావోద్వేగానికి లోనైన వీడియోకు కూడా అధిక సంఖ్యలో వ్యూవ్స్ వచ్చాయి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో చేసిన ఇంటర్వ్యూను కూడా ఎక్కువ మందే చూశారు. యూట్యూబ్ ఛానళ్లు కలిగి ఉన్న నేతల్లో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో (36 లక్షల సబ్స్క్రైబర్లు)రెండవ ర్యాంక్లో, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ అబ్రాడార్(30.7 లక్షలు) మూడవ స్థానంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(7.03 లక్షలు) నాలుగవ స్థానంలో ఉన్నారు.