న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని మోదీ గత పదేళ్ల నుంచి ప్రత్యేక ఆకర్షణలో ఎర్ర కోట వేడుకల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆ వేడుకల కోసం ఆయన ధరించే తలపాగా ఎప్పుడూ ఆకర్షణగా ఉంటోంది. అయితే ఈసారి కూడా ప్రత్యేకమైన తలపాగాతో ఎర్రకోటపై ప్రధాని మోదీ దర్శనం ఇచ్చారు. ఆయన ఈసారి రాజస్థానీ సంప్రదాయ బందేజ్ సాఫా తలపాగా(Bandhej Safa Turban)ను పెట్టుకున్నారు. ఆ తలపాగాతోనే ఆయన చరిత్రాత్మకమైన ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
గడిచిన పదేళ్ల నుంచి ప్రధాని మోదీ ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజున రంగు రంగుల తలపాగాను పెట్టుకున్నారు. బందనీ ప్రింట్కు చెందిన రాజస్థానీ తలపాగాను ఈసారి పెట్టుకున్నారు. ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్తో ఆ సాఫా తలపాగాను ప్రింట్ చేశారు. వైట్ కుర్తా, చురిదార్తో పాటు బ్లాక్ జాకెట్ వేసుకున్నారు. అయితే ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ గెటప్తో కనిపించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.