న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కాగా, స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలకు వేదికైన ఎర్రకోటపై.. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఎర్రకోటను తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. ఢీల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.