హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 2-4 తేదీల మధ్య యూరప్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యల నేపథ్యంలో యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల అధినేతలతో భేటీ కానున్నారు. జర్మనీలో ఛాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. దీంతోపాటు భారత్-జర్మనీల మధ్య జరిగే 6వ ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్లోనూ పాల్గొననున్నారు. అనంతరం డెన్మార్ ప్రధాని మాట్ ఫ్రెడరిక్ సన్ ఆహ్వానం మేరకు కోపెహగాన్ను సందర్శించున్నారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా రెండో భారత్-నార్డిక్ సమ్మిట్లో పాల్గొంటారు. 4న తిరిగి భారత్కు తిరిగి వచ్చే ముందు ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో రెండోసారి భేటీకానున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు భారత్పై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యూరప్ సైతం నిరంతరం భారత్కు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలోనే.. మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే తమకు అభ్యంతరం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు.