న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంపై జాగ్రత్తగా ఉండాలని, అదే సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వందేండ్లకు ఓసారి వచ్చే ఇలాంటి మహమ్మారిపై పోరులో మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టామని చెప్పారు. గురువారం దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ర్టాల సీఎంలతో వర్చువల్గా ప్రధాని సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. స్థానికంగానే వైరస్ కట్టడి చేసేందుకు దృష్టి సారించాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో పాటు వారి ఉపాధి, ఆర్థికవ్యవస్థను కాపాడేలా రాష్ర్టాల్లో ఆంక్షలు ఉండాలని స్పష్టంచేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉందని చెప్పారు. కరోనాతో పోరాడటంలో రెండేండ్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారమని చెప్పారు.