న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని పేర్కొన్నారు. పీవీ నరసింహా రావు శతజయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాని ప్రధాని చెప్పారు. గతేడాది జూన్లో మన్కీ బాత్ కార్యక్రమంలో పీవీకి గురించి మాట్లాడిన వీడియోను మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు.