న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అలుమ్ని అసోసియేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న ప్రారంభిస్తారని రక్షణ కార్యదర్శి అజయ్కుమార్ సోమవారం తెలిపారు. రాబోయే రెండేళ్లలో ప్రారంభించనున్న 100 సైనిక్ స్కూల్స్తో సహా పలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. నవంబర్ 19న ప్రారంభించనున్న ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘంలో ఎంపీ నరేంద్ర మోడీ తొలి సభ్యుడిగా ఉంటారన్నారు. సరిహద్దు, కోస్టల్ జిల్లాల్లోని 1,283 పాఠశాలల్లో ఎన్సీసీ ఉంటుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో 896 పాఠశాలలు, తీర ప్రాంతాల్లో 255, భారత వైమానిక దళం ఉన్న స్టేషన్లలో 132 ఉన్నాయని పేర్కొన్నారు.