న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైన జిల్లాల అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్షా నిర్వహించనున్నారు. జీ-సమ్మిట్, కాప్-26 (COP-26) సమ్మిట్లో పాల్గొని తిరిగి భారత్కు చేరుకున్న అనంతరం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తారని పీఎంఓ కార్యాలయంలో తెలిపింది. భేటీలో కొవిడ్-19 వ్యాక్సినేషన్లో మొదటి డోస్ 50శాతం కంటే తక్కువ కవరేజీ, రెండో డోస్ కవరేజీ తక్కువ నమోదైన జిల్లాలు ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని టీకా కవరేజీ తక్కువ ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని సంభాషిస్తారని, కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరవుతారని పీఎం కార్యాలయం పేర్కొంది.