న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ చేరుకున్న అనంతరం ఉక్రెయిన్ అంశంపై విచారించనున్నారు. విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 900 వరకు తరలించారు. మరికొంత మందిని తరలించాల్సి ఉన్నది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పునిత్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చింది.