న్యూఢిల్లీ : ప్రధాని మోదీ తన క్యాబినెట్ను విస్తరించనున్నారు. కొత్తగా తన క్యాబినెట్లోకి 20 మందిని చేర్చుకోనున్నారు. కొత్త మంత్రుల సమాచారాన్ని ఇవాళ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే లోక్ కళ్యాణ్మార్గ్లో ఉన్న ప్రధాని మోదీ నివాసానికి ఇప్పటికే కొందరు నేతలు చేరుకున్నారు. కొత్త మంత్రివర్గంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు పెద్దపీట దక్కే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర క్యాబినెట్లో 81 మంది మంత్రులు ఉండాలి. అయితే ఇప్పటికే 52 మంది మంత్రులు ఉన్నారు. అంటే కనీసం 28 మందికి కొత్త క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు సరబానంద సోనోవాల్, జ్యోతిరాధిత్య సింధియా, నారాయణ రాణే ఇప్పటికే మోదీ నివాసానికి చేరుకున్నారు. వీరికి క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కనున్నది.
క్యాబినెట్లో మొత్తం 12 మంది ఎస్సీ, 8 మంది ఎస్టీ, 27 మంది ఓబీసీ క్యాటగిరీకి చెందినవారు ఉండే అవకాశం ఉంది. లోక్ కళ్యాణ్ మార్గ్ చేరుకున్నవారిలో భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అనుప్రియా పటేల్, అజయ్ భట్, శోభా కరంజేల్, సునితా దుగ్గ, ప్రీతమ్ ముండే, శంతను ఠాకూర్, కపిల్ పటేల్, పశుపతినాథ్, ఆర్సీపీ సింగ్, కిషణ్ రెడ్డి, పరుశోత్తం రూపాలా, అశ్విని వైష్ణవ్, విజయ్ శోంకర్లు ఉన్నారు.