న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. పీఎంవో తన ట్విట్టర్లో ఈ విషయాన్ని చెప్పింది. వంద కోట్ల కోవిడ్ టీకాల మార్క్ను ఇండియా దాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా చరిత్ర సృష్టించినట్లు మోదీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను దిగ్విజయంగా చేపడుతున్న హెల్త్వర్కర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.