మైసూరు: ప్రధాని మోదీ బస చేసిన బిల్లును సంబంధిత అధికారులు చెల్లించకపోవంతో మైసూరులోని ఓ హోటల్ కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నది. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా మోదీ ఇక్కడ బస చేశారు.
ఈ కార్యక్రమాలను జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ), పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్) 2023 ఏప్రిల్లో నిర్వహించాయి. తమకు రూ.80.6 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉందని హోటల్ మేనేజర్ తెలిపారు. ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎన్టీసీఏ చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెల్లించడం లేదు. దీంతో ఈ బిల్లు కోసం కోర్టుకు వెళ్లాలని హోటల్ యాజమాన్యం భావిస్తున్నది.