Global Export Hub : భారత్ను అంతర్జాతీయ ఎగుమతుల హబ్గా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఢిల్లీలోని భారత్ మంటపంలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభిస్తూ ప్రధాని మాట్లాడారు. రాబోయే పాతికేండ్లలో భారత్ను తాము వికసిత్ రాజ్యంగా ఆవిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమం లక్ష్యంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా భారత టెక్స్టైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం టెక్స్టైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రెట్టింపయ్యాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
దేశంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని వివరించారు. 2014లో దేశంలో టెక్స్టైల్ మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం ఆ విలువ రూ. 12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. గత పదేండ్లలో నూలు, దుస్తులు, అపెరల్ ఉత్పత్తి ఏకంగా 25 శాతం పెరిగిందని తెలిపారు.
Read More :