PM Modi : తన 11 రోజుల ఉపవాస దీక్షలో తాను రాముడు నడయాడిన ప్రదేశాలను సందర్శించానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ప్రధాని మాట్లాడుతూ నాసిక్లోని పంచ్వటి ధామ్, కేరళలో త్రిప్రయర్ ఆలయం, ఏపీలో లేపాక్షి ఆలయం, శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం, రామేశ్వరం, ధనుష్కోడిలోని రామనాధస్వామి ఆలయాలను దర్శించుకున్నానని చెప్పారు.
సముద్రం నుంచి సరయూ నది వరకూ అదే పండుగ స్ఫూర్తితో ప్రతిచోటా శ్రీరామ నామం ధ్వనించిందని అన్నారు. దేశం ఆత్మలోని ప్రతి అణువుతోనూ శ్రీరాముడు అనుసంధానమై ఉన్నాడని పేర్కొన్నారు. భారతీయుల హృదయాల్లో రాముడు కొలువై ఉన్నాడని చెప్పారు. ప్రజల జ్ఞాపకాల్లో, సంప్రదాయ పండుగల్లో రాముడి ప్రస్తావన ఉందని చెబుతూ పలు భాషల్లో తాను శ్రీరామ కథను విన్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇక అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వంటి ప్రముఖుల సమక్షంలో వేలాది మంది అతిధుల మధ్య జై శ్రీరాం నినాదాలు హోరెత్తగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సాగింది.
Read More :
PM Modi: శ్రీరాముడి క్షమాపణలు కోరుతున్నా: ప్రధాని మోదీ