న్యూఢిల్లీ : తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ సహా ఇతరుల భౌతిక కాయాలు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్కు గురువారం రాత్రి చేరుకోనున్నాయి. ఎయిర్పోర్ట్లో రావత్తో పాటు మృతుల భౌతిక కాయాలను ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సందర్శించి వారికి నివాళులు అర్పిస్తారు.
బిపిన్ రావత్తో పాటు మృతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్లో జరగనున్నాయి. తమిళనాడులోని కూనూర్లో హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్వాడ్రన్ లీడర్ కే సింగ్, జేడబ్ల్యూఓ దాస్, ప్రదీప్, సత్పాల్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ సాయితేజ మరణించారు.