Heeraben Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి ఆమెకు ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మోహతా కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్లో చేర్పించిన విషయం తెలిసిందే. అక్కడ హీరాబెన్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకాడగానే ఉందని. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి.
ఈ ఏడాది జూన్ 13న హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టారు. తల్లి అనారోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని మోదీ హుటాహుటిన బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించారు.