న్యూఢిల్లీ, డిసెంబర్ 1: గుజరాత్లో మోర్బీ వంతెన ప్రమాదస్థలిని పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క రోజుకే రూ.30 కోట్లు. అదే సమయంలో ప్రమాదంలో మృతిచెందిన 135మంది బాధిత కుటుంబాలకు అందించిన పరిహారం రూ.4 లక్షల చొప్పున రూ.5 కోట్లేనని తేలింది.
సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తున్న ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. ప్రధాని స్వాగత కార్యక్రమం, ఫొటోగ్రఫీకే రూ.5.5 కోట్లు ఖర్చు చేశారని అందులో వెల్లడించారు. మోర్బీ వంతెన రిపేర్లకు ఓరెవా కంపెనీ కేవలం రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేయగా.. ప్రధాని ఒక్కరోజు పర్యటనకు అధికారులు రూ.30 కోట్లు వెచ్చించారు. 135 మంది ప్రాణాల కంటే మోదీ ఈవెంట్ మేనేజ్మెంట్కే ఖర్చు ఎక్కువ అయిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.