న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని, ఆ ప్రతిపాదనలను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా తప్పుపట్టారు. దేశ ప్రజలను ఎందుకు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు సెక్యూర్టీలను జారీ చేసి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సుమారు 14.13 లక్షల కోట్ల రుణం తీసుకోనున్నట్లు ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆ విషయాన్ని ప్రియాంకా గాంధీ తన ఎక్స్ అకౌంట్లో ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 14 లక్షల కోట్లు అప్పు తీసుకోవాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించిందని, ఎందు కోసం ఆ డబ్బు అని ప్రియాంకా ప్రశ్నించారు.
స్వంతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు దేశం చేసిన అప్పు 55 లక్షల కోట్లు మాత్రమే అని, కానీ గడిచిన పదేళ్లలో మోదీ సర్కారు ఆ రుణాన్ని 205 లక్షల కోట్లకు చేర్చినట్లు ప్రియాంకా ఆరోపించారు. అంటే మోదీ సర్కారు గత పదేళ్లలో సుమారు 150 లక్షల కోట్ల అప్పు చేసినట్లు తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడిపై 1.5 లక్షల అప్పు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
वित्त मंत्रालय का कहना है कि भारत सरकार मौजूदा वित्त वर्ष में 14 लाख करोड़ से अधिक का कर्ज लेने जा रही है।
क्यों?
आजादी के बाद से वर्ष 2014 तक, 67 सालों में देश पर कुल कर्ज 55 लाख करोड़ था।
पिछले 10 वर्ष में अकेले मोदी जी ने इसे बढ़ाकर 205 लाख करोड़ पहुंचा दिया।
इनकी सरकार…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 30, 2024