కాశీ: కాశీలో ప్రతి రాయి శివుడే.. కాశీకి సేవ చేయడం అనంతం.. కాశీ.. భారత సంస్కృతిక రాజధాని అని మోదీ అన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉండాలన్నారు. భారతీయ సనాతన సంప్రదాయాలకు ప్రతీక వారణాసి అన్నారు. భారత్లో భక్తిని ఢీకొనే శక్తి దేనికీ లేదన్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన సమయం ఆసన్నమైందన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం విశ్వనాథ ఆలయంలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. నేటి భారత్.. కోల్పోయిన వైభవాన్ని అందుకుంటోందన్నారు. చోరీకి గురైన అన్నపూర్ణ విగ్రహం మళ్లీ వందేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిందన్నారు. దేశం కోసం మీరంతా మూడు సంకల్పాలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛత, సృజన్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం నిరంతరం ప్రయత్నం చేశాలని మోదీ అన్నారు. స్వచ్ఛత జీవన శైలి కావాలన్నారు. దేశం అభివృద్ధి ఎంత సాధించినా.. స్వచ్ఛత చాలా కీలకం అన్నారు. ఆత్మ నిర్భర భారత్ చాలా అవసరం అన్నారు.
గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. విశ్వనాథుడికి జలాభిషేకం చేసిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. కాశీ ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాశీలో ఏది జరిగినా అది మహాదేవుడి కృపతో జరుగుతుందని ఆయన అన్నారు. ఇక్కడ కేవలం ఢమరుక సర్కార్ ఉంటుందన్నారు. అయోధ్యలో రామ మందిరమే కాదు.. మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామన్నారు. విశ్వనాథుడి జీర్ణోద్దరణ మాత్రమే కాదు.. అంతరిక్ష రంగంలోనూ ఇండియా వైభవంగా వెలుగుతోందన్నారు. దక్షిణ భారత దేశం కాశీ క్షేత్ర ఆనవాళ్లను ఆదిరిస్తుందన్నారు. ప్రాచీన, ఆధునికతకు కాశీ కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రతి భారతీయుడి తనకు శివుడి అంశమే అన్నారు.