కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు దశల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం, తృణమూల్కాంగ్రస్ అధినేత్రి మమతా బెనర్జీలో అలజడి నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీదీలో ఓటమి భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బెంగాల్లోని బరాసత్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ మే 2న ఎన్నికల ఫలితాల రోజు ఆమెకు ఇప్పుడే వచ్చినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
దీదీ ఆమె పార్టీ పరిస్ధితి వినాశకాలే విపరీతబుద్ధి అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీకి భారీగా ఓట్లు పడుతున్నాయని గ్రహించిన మమతా బెనర్జీ బెంగాల్లో భారీ పోలింగ్ జరగకుండా అడ్డకుంటు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. విధ్వంసం సృష్టిస్తున్న తృణమూల్ గూండాలపై చర్యలు చేపట్టడం లేదని అన్నారు. అంతకుముందు ప్రధాని పుర్బ వర్ధమాన్ జిల్లాలోని తలిత్ సాయి సెంటర్లో, నదియా జిల్లాలోని కళ్యాణి యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరిగిన ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు.