న్యూఢిల్లీ, నవంబర్ 13: క్రిప్టోకరెన్సీపై అధిక లాభాల ఆశచూపి యువతను మభ్యపట్టే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కరెన్సీ ద్వారా మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ రిస్క్లున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్రిప్టోకరెన్సీపై అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. డిజిటల్ కరెన్సీ కొత్తగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీ అయినందున, నిపుణులు, భాగస్వామ్యవర్గాలతో చర్చించి, తగిన విధానాల్ని రూపొందించాలని సమావేశం అభిప్రాయపడింది. రెండు రోజుల క్రితమే రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్…క్రిప్టోకరెన్సీల పట్ల తీవ్ర ఆందోళనల్ని వ్యక్తంచేసారు. ఇందుకు సంబంధించి కొన్ని వివరాణాత్మక సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించామన్నారు.