PM Modi : స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారు మన ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వారి నెలకొల్పిన సంస్కృతి గురించి వారే సిగ్గుతో తలదించుకునే ధోరణిని నెలకొల్పారని అన్నారు.
అయోధ్యలో ఇటీవల జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తోసిపుచ్చడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశ సనాతన సంస్కృతిని వారు అవమానిస్తున్నారని కాషాయ నేతలు కాంగ్రెస్ అగ్రనేతల తీరును ఎండగట్టారు.
ఇక ప్రధాని మోదీ గువహటిలో ఆదివారం రూ.11,599 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలకు హాజరైన అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో అసోం, ఈశాన్య రాష్ట్రాలకు మిగిలిన ప్రపంచంతో మెరుగైన అనుసంధానం నెలకొంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టులు పర్యాటక రంగంలో ఉద్యోగావకాశాలను పెంచుతాయని వెల్లడించారు. మా కామాఖ్య యాక్సెస్ కారిడార్ పూర్తయితే ఈశాన్య ప్రాంత టూరిజానికి ముఖద్వారంగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్ మా నోటీసులను లెక్కచేయడం లేదు.. ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు