PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భూటాన్ (Bhutan) చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం (Bhutan Tour) శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు. తాజా పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అదేవిధంగా రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరుకానున్నారు.
తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్యూక్ గ్యాల్పో’ను మోదీకి అందజేయనున్నారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రధానికి రాలేదు. ఇప్పుడు ఆ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ చేతుల మీదుగా మోదీ స్వయంగా అందుకోనున్నారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు, కొవిడ్ సమయంలో తొలి విడతలోనే 5 లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలు తీసుకొన్నందుకు గానూ మోదీకి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. కాగా, వాస్తవానికి మోదీ నిన్ననే భూటాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. ఒకరోజు ఆలస్యంగా ఇవాళ ఆ దేశ పర్యటకు వెళ్లారు.
Also Read..
Arvind Kejriwal | రాత్రంతా లాకప్లోనే కేజ్రీవాల్.. 10 రోజులు కస్టడీ కోరే అవకాశం
Pushpak | ఇస్రో మరో ఘనత.. పుష్పక్ ప్రయోగం విజయవంతం