న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సోమవారం విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై సమీక్షిస్తారని, అలాగే దక్షిణాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ప్రపంచ సమస్యలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
వర్చువల్ సమావేశం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మోదీ, బైడెన్ భేటీకి ముందు 2+2 మంత్రుల సమావేశం జరుగుతుందని తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా ఢిపెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశంలో పాల్గొంటారని తెలిపింది. అయితే, మోదీతో బైడెన్ వర్చువల్ సమావేశం నిర్వహిస్తుందని వైట్హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు నేతలు పరస్పర సహకారం తదితర అంశ ఆలపై చర్చిస్తారని వైట్హౌస్ సెక్రెటరీ పేర్కొన్నారు.