న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తనను క్షమించలేదని భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ థాకూర్(MP Pragya Thakur) తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు చెందిన అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. అయితే ఆ జాబితాలో భోపాల్ సీటును అలోక్ శర్మ అనే అభ్యర్థికి కేటాయించారు. సాధ్వీ ప్రజ్ఞా థాకూర్ను పక్కనపెట్టేశారు. గతంలో నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్క్షా థాకూర్పై ప్రధాని మోదీ సిరీయస్గా ఉన్నట్లు తెలుస్తోంది. తనను క్షమించేది లేదని మోదీ గతంలో పేర్కొన్నట్లు ఆమె వెల్లడించారు.
బీజేపీ తన తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో 33 మంది సిట్టింగ్ ఎంపీలకు ఈసారి సీటు దక్కలేదు. ఆ లిస్టులో ప్రజ్ఞా కూడా ఉన్నారు. గతంలోనూ తాను ఎప్పుడు టికెట్ అడగలేదని, ఇప్పుడు కూడా నేనేమీ కోరడం లేదని, గతంలో ఓ సందర్భంలో తాను వాడిన పదాలను బహుశా ప్రధాని మోదీకి నచ్చలేదనుకుంటానని, తనను క్షమించేబోనని ఆయన గతంలో పేర్కొన్నారని, ఆయకు క్షమాపణలు చెప్పానని ప్రజ్ఞా థాకూర్ తెలిపారు.