న్యూఢిల్లీ, జనవరి 8: ప్లాస్టిక్ వస్తువుల్లో భద్రపరిచే, వాటిల్లోని ఆహారం తినడం ద్వారా శరీరంలోని సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయన్న విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఆ ప్లాస్టిక్ అణువుల్లో ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని కన్జూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది.
85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫాలేట్స్ , 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్-ఏ అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్టు తెలిందని తెలిపింది. ఫాలేట్స్, బైస్ఫెనాల్స్లు శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హాన్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయని హెచ్చరించింది.