Union budget 2022 : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో బడ్జెట్ అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు బడ్జెట్ను అర్థం చేసుకోవడం రాహుల్కు తెలియదని ఎద్దేవా చేశారు. అలాగే మ్యాథమెటిక్స్ కూడా రాహుల్కు తెలియదని విరుచుకుపడ్డారు. బడ్జెట్ను అర్థం చేసుకోవడానికి కాస్త తెలివితేటలు అవసరమని పీయూశ్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ప్రతి విషయాన్నీ సున్నాతోనే చూస్తారని, ఓ కొత్త రకం బడ్జెట్ను ప్రవేశపెట్టి, కేంద్ర ఆర్థిక మంత్రి దేశాన్ని కొంత పుంతలు తొక్కించారని పీయూశ్ పేర్కొన్నారు. ‘మ్యాథమెటిక్స్ను అర్థం చేసుకోవడంలో రాహుల్కు సమస్య ఉందని నా అభిప్రాయం. ఆయన ప్రతిదీ సున్నాతోనే చూస్తారు. తెలివితేటలున్న ప్రతి వ్యక్తీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను మెచ్చుకున్నారు.’ అని పీయూశ్ పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బడ్జెట్ విధి విధానాలపై విమర్శలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో బడ్జెట్ అని విమర్శించారు.ఈ బడ్జెట్లో పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఒరిగిందేమీ లేదంటూ ట్వీట్ చేశారు.