సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్ లాగా మారిపోవద్దంటూ హెచ్చరించారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. యూపీ కేరళ లాగా మారిపోతుందని యోగి తెగ భయపడుతున్నారని, ఒక వేళ యూపీ కేరళలాగా మారితే మంచి విద్య యూపీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ‘యూపీ కేరళగా మారితే ఎలా అని యోగి యోచిస్తున్నారు. ఏమవుతుంది మారితే? మంచి విద్య ప్రజలకు దక్కుతుంది. మంచి వైద్యం, సాంఘిక సంక్షేమం అందుబాటులోకి వస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మత సామరస్యం పెరుగుతుంది. ఒకరినొకరు మతాల పేరుతో చంపుకోరు. అలాంటి యూపీని ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ సీఎం పినరయ్ విజయన్ ట్విట్టర్ వేదికగా సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు.