జైపూర్: కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. రాజస్థాన్ సీఎం అశ్క్ గెహ్లాట్తో కొన్నేండ్లుగా ఆయనకు పొసగని విషయం విదితమే. దీంతో కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో సచిన్ పైలట్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈనెల 11న ఆయన తండ్రి రాజేశ్ పైలట్ వర్థంతి సందర్భంగా నూతన పార్టీ పేరును ప్రకటించనున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టనున్నట్టు వస్తున్న వార్తలను ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సుఖీందర్ సింగ్ రంధవ ఖండించారు. పైలట్కు అటువంటి ఆలోచనలు లేవని, మీడియా అలాంటి వార్తలను సృష్టిస్తున్నదని వ్యాఖ్యానించారు.