న్యూఢిల్లీ, జనవరి 2: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని న్యాయవాది గోపాల్ సింగ్ దాఖలు చేశారు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన కమిటీలో నుంచి సీజేఐను తొలగిస్తే పారదర్శకత ఎక్కడుంటుందని పిటిషనర్ ప్రశ్నించారు.
అన్ని రకాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునేలా కేంద్రం చర్య ఉన్నదని తెలిపారు. పారదర్శకంగా స్వతంత్ర వ్యవస్థ ఉండేలా చూడాలని, ఇందుకోసం సమ దృష్టితో వ్యవహరించే కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం సీఈసీ, ఈసీల నియామక కమిటీలో ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, కేంద్రమంత్రి ఉంటారు.