బిలాస్పూర్, అక్టోబర్ 15: వ్యక్తులకు తెలియకుండా వారి మొబైల్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 38 ఏండ్ల మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తనకు తెలపకుండా తన భర్త తాను ఫోన్లో అతడితో మాట్లాడిన మాటలను రికార్డు చేశాడని ఆమె కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమె తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఆమెకు తెలియజేయకుండా ఆమె సంభాషణను రికార్డు చేసి దాన్ని తిరిగి ఆమెకు వ్యతిరేక సాక్ష్యంగా చూపలేరని తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ రాకేశ్ మోహన్ పాండే ఈ నెల 5న ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారు.