న్యూఢిల్లీ: ఫిలిప్పీన్స్, చైనాకు చెందిన రెండు కోస్ట్గార్డు నౌకలు ఢీకొనడంతో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిలిప్పీన్స్ నౌక స్పల్పంగా దెబ్బతింది. బీజింగ్కు చెందిన భారీ నౌక తమ సరుకుల నౌకను సెకండ్ థామస్ షౌల్ వద్ద అడ్డుకుందని ఫిలిప్పీస్స్ కోస్ట్గార్డు ప్రతినిధి ఆరోపించారు.
చైనా నౌకలు తమపై జల ఫిరంగులు కూడా ప్రయోగించాయన్నారు. మనీలా నౌకలు తమ జలాల్లోకి ప్రవేశించడంతో వాటిని నియంత్రించే చర్యలు మాత్రమే చేపట్టామని చైనా తన చర్యను సమర్థించుకుంది. ఆస్ట్రేలియాలో బుధవారం ప్రారంభం కానున్న ఆగ్నేయాసియా దేశాల సదస్సులో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఈ అంశాన్ని ప్రస్తావించవచ్చునని భావిస్తున్నారు.