వాహనదారులకు షాక్: మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశీ ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి వెళ్ళాయి. గతనాలుగు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడం గమనార్హం. పెట్రోల్ ధర 28 పైసలు, డీజిల్ ధర 27 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్లో ఈరోజు పెట్రోల్ ధర రూ.86.46కు, డీజిల్ ధర రూ.80కు చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.70 శాతం పెరుగుదలతో 49.05 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.99 శాతం పెరుగుదలతో 46.09 డాలర్లకు ఎగసింది.
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. 27 పైసలు పెరుగుదలతో రూ.83.13కు చేరుకున్నది. డీజిల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.73.32కు ఎగసింది. ముంబైలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.89.78కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.79.93కు ఎగసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య
- ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!
- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
- ఆస్ట్రేలియా మాజీలకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- ట్రాక్టర్ల ర్యాలీపై వెనక్కి తగ్గం..
- అందరూ హీరోలే.. నమ్మశక్యం కాని విజయమిది
- నా సినిమా ఎవరైనా చూస్తారా అనుకున్నా : విజయ్ దేవరకొండ
- సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర విషయాలు.. బెంగాల్లో మళ్లీ గెలిచేది మమతనే!