Petrol Price | పలు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం వాహనదారులకు షాక్ల మీద షాక్ ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చిది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్(Petrol prices )ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 97, డీజిల్పై 99 పైసల చొప్పున రేట్లను పెంచింది.
కాగా, ఇంధన ధరల పెంపు ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.3వరకు పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84, డీజిల్ రూ.100.94కు పెరిగింది.