న్యూఢిల్లీ, జూలై 2: గత 2 నెలల నుంచి ఇంధన ధరలను పెం చుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలను పెంచాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.99.16కి పెరిగింది. చెన్నైలో రూ.100.13కి చేరగా.. కోల్కతాలో రూ.99.04కి చేరింది. పంజాబ్లోని జలంధర్లో రూ.100.22కు పెరిగింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, హైదరాబాద్లలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం డీజిల్ ధరను పెంచలేదు.