న్యూఢిల్లీ: రాఖీ పౌర్ణమి వేళ దేశ ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించే వార్త. సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 20 పైసల మేర తగ్గించాయి. అదేవిధంగా డీజిల్పై 18 పైసలు కోతపెట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.64, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోలు రూ.107.66, డీజిల్ 96.64, చెన్నైలో పెట్రోలు రూ.99.32, డీజిల్ 93.66, కోల్కతాలో పెట్రోలు రూ.101.93, డీజిల్ 92.13, బెంగళూరులో పెట్రోలు రూ.105.13, డీజిల్ 94.49గా ఉన్నాయి. ఇక తాజా తగ్గింపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69, డీజిల్ రూ.97.15కి తగ్గాయి.
దేశంలో మే, జూన్ నెలల మధ్య పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఆ రెండు నెలల్లో 42 సార్లు అధికమయ్యాయి. మొత్తంగా లీటరు పెట్రోలుపై రూ.11.52 వినియోగదారులపై భారం మోపాయి. అయితే ఈ బాదుడుకు జూలై 18న బ్రేక్ పడింది. తాజాగా చాలా కాలంపాటు స్థిరంగ ఉన్న పెట్రోల్ ధరలు ఇవాళ 20 పైసల మేర తగ్గాయి.