న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వరుసగా ఏడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్ ధరను 30 పైసలు, డీజిల్ ధరను 35 పైసల చొప్పున పెంచినట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో కేరళ, కర్ణాటకలో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటింది. తాజా వడ్డింపుతో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.104.44కు, ముంబైలో రూ.110.41కి, హైదరాబాద్లో రూ.108.60కు పెరిగి ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. లీటర్ డీజిల్ ధర హైదరాబాద్లో రూ.101.62కు పెరిగింది.