న్యూఢిలీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్పై 30 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.104.14, లీటరు డీజిల్ రూ.92.82కు చేరుకున్నది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రికార్డుస్థాయిలో రూ.110.12గా ఉండగా, లీటరు డీజిల్ ధర తొలిసారిగా రూ.100.66కు చేరింది.