హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా వారం రోజులపాటు కొనసాగిన పెట్రో మంట మంగళవారం నిలిచింది. అయితే రెండు రోజులు విరామం ఇచ్చిన చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి వినియోగదారుల జేబుకు చిల్లువేశాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.79కు చేరగా, డీజిల్ ధర రూ.93.52కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్పై 34 పైసలు పెరగడంతో రూ.110.75కు, డీజిల్పై 37 పైసలు అధికమవడంతో రూ.101.40కు చేరాయి.
హైదరాబాద్లో లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర రూ.109కి చేరగా, డీజిల్ రూ.102.04కు పెరిగింది. తాజా పెంపుతో చెన్నైలో పెట్రోల్ రూ.102.10, డీజిల్ రూ.97.93, కోల్కతాలో పెట్రోల్ రూ.105.44, డీజిల్ రూ.96.63, బెంగళూరులో పెట్రోల్ రూ.108.44, డీజిల్ రూ.99.26కు చేరాయి.
గత సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 30 పైసల నుంచి 39 పైసల వరకు పెరిగాయి. దీంతో అక్టోబర్ నెలలో చమురు ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గత 20 రోజుల్లో 15 రోజులు చమురు ధరలు అధికమయ్యాయి. దీంతో మంగళవారం నాటికి ఢిల్లీలో లీటరుకు రూ.4.55 పెరిగాయి.