చెన్నై: తమిళనాడు గవర్నర్ నివాసమైన రాజ్భవన్పైకి ఓ వ్యక్తి పెట్రోల్ బాంబును విసిరాడు. ఇది రాజ్భవన్ మెయిన్ గేట్ వద్ద పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ సంతకం పెట్టడం లేదని నినదించాడు.