అహ్మదాబాద్, ఏప్రిల్ 24: గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరోదాగామ్ ప్రాంతంలో జరిగిన ఊచకోత
కేసులో నిందితులైన 67 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్
చేయాలని సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తున్నది.
తీర్పు కాపీని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నది. ఈ సిట్ను గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.