న్యూఢిల్లీ, నవంబర్ 1: స్వలింగ జంటల వివాహాలకు చట్టపరమైన గుర్తింపును తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. స్వలింగ జంటల వివాహ కేసు పిటిషనర్ అయిన ఉదిత్ సూద్ సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. స్వలింగ జంటల వివాహ చట్టబద్ధతపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు స్వీయ విరుద్ధమే కాక, అన్యాయంగా ఉందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. స్వలింగ వ్యక్తులపై సమాజంలో చూపుతున్న వివక్షను అంగీకరించిన సుప్రీం కోర్టు వివక్షకు గల కారణాలను మాత్రం తొలగించలేదన్నారు. స్వలింగ జంటలకు సమాన హక్కులు తిరస్కరించడం ద్వారా వారిని మానవుల కన్నా తక్కువగా చూశారని అన్నారు. దీనిని సమాజంలోని ఒక వర్గం సమస్యగా కాకుండా వ్యక్తుల సమస్యగా ప్రతివాదులు భావించారని, ప్రభుత్వం కూడా ఇదే వైఖరితో ఉందని అన్నారు. స్వలింగ జంటల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపును నిరాకరిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి ఏదైనా చట్టాలు చేసే హక్కు పార్లమెంట్కు మాత్రమే ఉందని ఐదుగురు జడ్జీల ధర్మానసం పేర్కొంది.