JK Elections : జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. రెండో విడతలో భాగంగా పీర్పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
రెండో విడత పోలింగ్ జరుగుతున్న 26 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రెండో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | J&K: People queue up at a polling station in Budgam Assembly constituency to vote in the second phase of the Assembly elections today.
Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today.
(Visuals from polling… pic.twitter.com/ZhaBRFmUSa
— ANI (@ANI) September 25, 2024