ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై విలేకరులు ప్రశ్నించగా.. ”ఇలా పర్యటనకు రావడం మంచిదే. ఒక నెల కాదు… మూడు నెలలైనా వారణాసిలోనే ఉండవచ్చు. అలా ఉండడానికి కూడా పూర్తి అర్హత గల ప్రదేశం. అయితే ప్రజలు తమ చివరి రోజుల్లో వారణాసిలోనే గడుపుతారు” అని అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దాని తర్వాత ఈ వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇచ్చారు. యూపీలో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్ అన్న అర్థంలోనే ఈ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి వద్దా తప్పులే చెబుతుందని, కానీ దేవుడి వద్ద మాత్రం అలా కుదరదని అఖిలేశ్ పేర్కొన్నారు.