హైదరాబాద్ :భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది పండుగల వేళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. విభిన్న రాష్ట్రాల్లో పండుగలు చేసే తీరు విభిన్నంగా ఉండొచ్చు లేదంటేవేర్వేరు పేర్లూ ఉండొచ్చు కానీ ఆ పండుగల వెనుక దాగిన పరమార్ధం మాత్రం ఒకటే. అందుకు ఉదాహరణ సంక్రాంతి పండుగ. భారతీయ పల్లె వైభవానికి ప్రతీక ఈ పండుగ. మాఘీ లేదా లోహ్రీ అని, ఉత్తర భారతదేశంలో దీనిని వేడుక చేసుకుంటే..
“మాఘ్ బిహు” అని ఈశాన్య రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పశ్చిమ భారతదేశంలో “ఉత్తరాయణ్” అని, తమిళనాడు లో “పొంగల్ “అని మహారాష్ట్ర, గుజరాత్లలో “మకర సంక్రాంతి” అని, తెలుగు వాళ్లు సంక్రాంతి అని అంటుంటారు. పంటలు బాగా పండాలని కోరుకుంటూనే ప్రకృతికికృతఙ్ఞతలు తెలుపుతూ చేసుకునే రైతుల పండుగ సంక్రాంతి.